జనసేన క్రియాశీలక వాలంటీర్లకు ఘన సత్కారం..

రాయవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు.. మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ నేతృత్వంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ మరియు వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో చెల్లూరు గ్రామంలో 255 సభ్యత్వంలు నమోదు చేసిన జనసైనికుడు కొండేపూడి ఆనంద్ ని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ అభినందించి.. పూలమాలలు వేసి.. దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ.. జనసైనికులు అందరూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.