వీఆర్వోల దీక్షకు జనసేన నాయకుల సంఘీభావం

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, మంత్రి అప్పలరాజు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని వీఆర్వోలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట తహసిల్దారు కార్యాలయం వద్ద వీఆర్వోలు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం 12 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారికి కొత్తపేట జనసేన పార్టీ నాయకులు అంబటి పరమేశ్వర రావు, తులా రాజు, కంఠంశెట్టి చంటి, చోడపనీడి ఉమామహేశ్వరరావు, యెలిశెట్టి శివ, వీధి జానకిరామ్ సంఘీభావం తెలిపారు.