పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించండి: జనసేన

అనకాపల్లి జీవీఎంసీ గ్రేటర్ పరిధిలో గత మూడు రోజుల నుండి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలపడం జరిగింది.
కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతొ అనకాపల్లిలో చెత్త పెరిగిపోయింది. ప్రస్తుతంఎడతెరిపి లేకుందా కురుస్తున్న వర్షాల కారణంగా పారిశుధ్యం ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలు అవుతారని తక్షణమే పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించవలసిందిగా. జనసేన పార్టీ తరఫున జీఎంసీ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.