ముత్తుకూరు గ్రామంలో పవన్ వారాహి పేరిట ప్రత్యేక పూజలు

సర్వేపల్లి నియోజకవర్గం: జూన్14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో చేపడుతున్న వారాహి విజయ యాత్ర విజయవంతం కావాలని, 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని, నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముత్తుకూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలూరు పెంచల నరసింహా, హరికృష్ణ, నీళ్ల విష్ణు, నాగవేటి రమేష్, తాండ్ర శ్రీను, నేలపూడి కళ్యాణ్, యన్. మురళి తదితరులు పాల్గొన్నారు.