లేపాక్షి ఆలయంలో బాలయ్య దంపతుల ప్రత్యేక పూజలు

హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు. ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగుతోంది. ఇక ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా శివరాత్రి సందర్భంగా లేపాక్షిలోని దుర్గా పాపనాశేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయాన్నే బాలకృష్ణ దంపతులు ఆలయానికి చేరుకొని మూలవిరాట్టు ని దర్శించుకున్నారు, శివుడికి శివరాత్రి సందర్భంగా అభిషేకం చేశారు.

ఆంధ్రపదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా బాలకృష్ణ సతీసమేతంగా హిందూపూర్ లోనే బస చేశారు. స్తానికంగా ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడే ఉండటంతో.. ఈరోజు శివరాత్రి వేడుకలను హిందూపూర్ లోనే జరుపుకుంటున్నారు.