వారాహి యాత్ర విజయవంతం కావాలని గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

  • వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

పాలకొండలో వున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న వారాహ యాత్ర విజయవంతం కావాలని మంగళవారం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, గారికూరంగి నాగేశ్వర్రావు, గోర్లే మన్మధ రావు, ఆధ్వర్యంలో.. ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం పాలకొండ నియోజకవర్గం జనసేన కేంద్ర కార్యాలయంలో వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మీడియాతో మాట్లాడుతూ.. యువత, రైతులు, విద్యార్థులు, మహిళలు వారాహి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ వారాహి యాత్రతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పులకు శ్రీకారం చుట్టుబోతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల అధ్యక్షులు మండంగి విశ్వనాథం, మిడితాన ప్రసాద్, డొంక శివ ప్రసాద్, సతివాడ వెంకటరమణ, ఎస్. శేకర్, వండాన సాయి కిరణ్, గర్భాపు నరేంద్ర, మాధసి సంతోష్, డాంపాక సాయి కుమార్, జామి రాంబాబు, మండాది హరీష్, గజేంద్ర నాయుడు, కే.వి.ఆర్ నాయుడు, అలజింగి రాంబాబు, బాను ప్రసాద్, సాయి, మణికంఠ, సుబ్బు, కిరణ్, జనసైనికులు పాల్గొన్నారు.