వారాహి యాత్ర విజయవంతం కావాలని బొలిశెట్టి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

తాడేపల్లిగూడెం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14న తలపెట్టిన “జనంలోకి జనసేనాని”, “వారాహి యాత్ర” విజయవంతం కావాలని బి.సి నాయకులు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులతో తాడేపల్లిగూడెం లోని, ఎస్.వి.ఆర్ సర్కిల్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడిలో జూన్ 14న ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగునని, కావున ఈ కార్యక్రమంలో జనసేన కుటుంబసభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.