టీమిండియాతో రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక
ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు శ్రీలంక కెప్టెన్ శనక. తొలి మ్యాచ్తో పోలిస్తే ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలించేలా ఉన్నదని అతను టాస్ సందర్భంగా అన్నాడు. ఈ మ్యాచ్కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక మాత్రం ఉడానా స్థానంలో రజితను టీమ్లోకి తీసుకుంది. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన ధావన్ సేన.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్ను గెలవాలని భావిస్తోంది.