లండన్ చేరుకున్న శ్రీ నాగబాబు

* ఘనస్వాగతం పలికిన ఎన్.ఆర్.ఐ. జనసేన శ్రేణులు
యూరప్ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు లండన్ చేరుకున్నారు. ఎన్.ఆర్.ఐ. జనసేన యూరప్ విభాగం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ముఖ్య జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. శనివారం సౌత్ హారో లో యూకే కు చెందిన జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. 10 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యూకేతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాల్లోని ఎన్.ఆర్.ఐ. జనసైనికులతో శ్రీ నాగబాబు గారు మమేకమవుతారు. పార్టీ బలోపేతం, ప్రవాస భారతీయులను పార్టీకి మరింత అనుసంధానం చేసే దిశగా శ్రీ నాగబాబు గారి పర్యటన సాగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.