వలిమాకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: యాడికిలోని స్థానిక చౌడేశ్వరి ఫంక్షన్ హాల్ నందు జరిగిన మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రహిమాన్ వలిమా రిసెప్షన్ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు యాడికి మండల ఇంచార్జ్ కోడి సునీల్ కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ నాయకులు హర్షద్అయూబ్, కొండా శివ, సయ్యద్ రసూల్, రమణ, హరి మరియు యాడికి మండల నాయకులు గుండ్ల శివ, పప్పు వెంకటేష్, జాకీర్, శివకుమార్, మణికిషోర్ తదితరులు పాల్గొన్నారు.