శ్రీనివాస్ మరణం ఎంతగానో బాధిస్తున్నది.. బండి సంజయ్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ గంగుల శ్రీనివాస్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్రీనివాస్ మరణం పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణాలో నీదే చివరి బలిదానం కావాలి. ప్రాణాలు ఎంతో విలువైనవని.. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఆత్మహత్యలు తల్లితండ్రులకు కడుపుకోత మిగులుస్తాయే తప్ప వాటి ద్వారా దేన్ని సాధించలేమని బండి సంజయ్ పేర్కొన్నారు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరడాన్ని కళ్లారా చూడడమే లక్ష్యం కావాలని అన్నారు. దాని కోసం బతికుండి పోరాటం చేయడమే మార్గంగా ముందుకు సాగాలన్నారు.