రాష్ట్ర అభివృద్ధి జనసేన-టీడీపీలతోనే సాధ్యం గోడపత్రికలు ఆవిష్కరించిన పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన-టీడీపీ పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని అనంతపురం అర్బన్ నియోజక వర్గ ప్రజలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన గోడ ప్రతులను జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్-కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఆ పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు వీర మహిళలు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే అని జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.