జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి

  • మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడిండి
  • మహిళలతో మాటమంతి నిర్వహించి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరిన జనసేన మహిళా నేత పెండ్యాల శ్రీలత

అనంతపురం రూరల్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత బుధవారం అనంతపురం రూరల్ మండలంలోని రుద్రంపేట పంచాయతి సైపుల్లా కాలనీలో 13వరోజు మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలతో మమేకమై మాట్లాడుతూ.. జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపాడని యువతకు ఉద్యోగాలు కూడా లేవని కనుక ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ పార్టీలకే ఓటు వేయాలని కోరుతూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో లోని ముఖ్యంశాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేళ రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు 20లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరిస్తూ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.