విజయవంతంగా 118వ రోజు జనసేన వనరక్షణ
జగ్గంపేట నియోజకవర్గం గోకవరంమండలం రంపయర్రంపాలెంలో 117 మరియు 118వ రోజు జనసేన వనరక్షణ ద్వారా 2000 నిమ్మమొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 115700 నిమ్మమొక్కలు పంచడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్య చంద్రరావు మొదలుపెట్టినటువంటి ఈ జనసేన వనరక్షణ కార్యక్రమం ఈ నెల 28 వ తారీఖుతో ముగియనుంది. జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ చేతూల్ మీదుగ చివరి మొక్కను పంచడంతో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ముగియనుందని, అప్పటికి సుమారు 124 రోజులతో సుమారు 1,25000 మొక్కలను పంపిణీ చేయబోతున్నమని తెలియజేసారు. తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్ మరియు నాదెండ్ల మనోహర్ పాల్గొనే ఈ కార్యక్రమంలో జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-9.40.47-PM-1024x562.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-8.44.52-PM-1024x469.jpeg)