Vijayanagaram: తక్షణమే రైతులకు బకాయిలు చెల్లించాలి

విజయనగరంజిల్లా, సీతానగరం మండలం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు యన్ సి ఎస్ చక్కెర కర్మాగారానికి ముడిచెరుకు అందించగా…. దాదాపు 2 సంవత్సరాలుగా చక్కెర కర్మాగారం యాజమాన్యం నుంచి డబ్బులు అందక ఇక్కట్లకు గురవుతున్నారని రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని రైతన్నలకు న్యాయం జరిగే వరకు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలబడతారని భరోసా తెలిపి జనసేన తరపున అండగా నిలబడటం జరిగినది. యన్ సి ఎస్ చక్కెర కర్మాగారం యొక్క యాజమాన్యం చెరుకు అందించే రైతన్నలకు దాదాపుగా 2 సంవత్సరాలు నుంచి 19 కోట్ల రూపాయలు బకాయిలు పడగా… అవి ఇవ్వనిది కాక రైతులు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమని తక్షణమే రైతులకు రావాల్సిన బకాయిలను ఇవ్వని పక్షంలో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ రావు అన్నారు.