యుద్ధ విమానాల్లో ఆక్సీజన్ టాంకుల సరఫరా

హైదరాబాద్‌: ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు.

సత్వరమే ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. మంత్రి ఈటల, సీఎస్‌ను ఆయన అభినందించారు. ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందన్నారు.