ప్రధాని మోదీ లేఖపై ట్విట్టర్ ద్వారా స్పందించిన సురేష్ రైనా
భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలికిన కొంత సమయానికే రైనా సైతం అదే బాటలో నడిచాడు. అత్యుత్తమ క్రికెటర్గా, బెస్ట్ ఫీల్డర్గా రైనా అందించిన సేవల్ని కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మాజీ క్రికెటర్ రైనాకు లేఖ రాశారు.
తన సేవల్ని గుర్తించినందుకు ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘థ్యాంక్యూ నరేంద్ర మోదీజి.. దేశం కోసం ఆడేటప్పుడు మేం చెమట చిందిస్తాం. శక్తివంచన లేకుండా ఆడతాం. దేశ ప్రజలతో పాటు ప్రధాని సైతం మా సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చిన సందేశాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. జై హింద్’ అని రైనా ట్వీట్ చేశాడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/08/image-25.png)