Hyderabad: జనసేన మద్దతు కోరిన స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్

స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వై రాజు మరియు వారి యూనియన్ సభ్యులు శుక్రవారం ట్యాంక్ బండ్ ప్రక్కన GHMC కమిషనర్ ఆఫీస్ ఆవరణలో యూనియన్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం లను సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు వై. రాజు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలలో జనసేన పార్టీ మద్దతు తమకు కల్పించాలని కోరడం జరిగింది. అనంతరం శ్రీ శంకర్ గౌడ్ మరియు శ్రీ రాధారం రాజలింగం మాట్లాడుతూ మీ యొక్క యూనియన్ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని యూనియన్ సభ్యులకు తెలియజేయడం జరిగింది.