మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తాళ్లూరి డేవిడ్
- 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
బోనకల్ మండలం, రావినూతల గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తాళ్లూరి డేవిడ్.. ఈ సందర్బంగా తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ ముందుగా అమరవీరులకు నివాళులర్పించి భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి 200 సంవత్సరాల ఆంగ్లెయుల పాలన నుండి ఆశేష భారత ప్రజల ఉద్యమంలొ తోడ్పడుతూ విముక్తి అని భావించిన స్వతంత్ర ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీజీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గార్లకి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు, సాటి విలువలను కాపాడుకుంటూ పాలకులు పాలితులు తమ తమ కర్తవ్యాలను నెరవేర్చుతూ దేశ ప్రజల సమూనతికి తోడ్పడాలని అప్పుడే ఆజాద్ అమృత మహా ఉత్సవానికి వజ్రా ఉత్సవానికి సార్ధకత ఉంటుందని సంకల్పానికి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ పాషా, అద్దంకి సంతోష్, సజ్జనపు భరత్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.