బెంతు ఒరియాల దీక్షకు అశోక్ బాబు మద్దతు

ఇచ్ఛాపురం నియోజకవర్గం: బెంతు ఒరియా కులస్తులు తమ కుల ధృవీకరణ పత్రాలు పునరుద్దరణ కోసం 22వ రోజులుగా మాణిక్యపురం గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ బాబు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంతు ఒరియాల దీక్షకు పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. అలాగే కవిటి మండలంలోని ఎంపీపీ కడియాల ప్రకాష్, ఎక్స్ ఎంపీపీ పిన్నింటి తిలక్, పూడి అబ్బాయి, బద్రి ప్రకాష్ హరి ప్రసాద్, ఎలమంచిలి నిలయ్య, నారాయణ స్వామి పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం బెంతు ఒరియా కులస్తులు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మూడు మండలాల్లోని తహసీల్దార్ అధికారులకు వినతీ పత్రం అందజేశారు. నిజమైన మా బెంతు ఒరియలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెంతు ఒరియా ప్రజా ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.