రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆర్.వినయ్ కుమార్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇది తాను తీసుకున్న కఠిన నిర్ణయమని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ జర్నీలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. వినయ్ కుమార్ టీమిండియా తరపున ఒక టెస్టు, 31 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 49 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో 105 మ్యాచ్ లు ఆడి 105 వికెట్లు పడగొట్టాడు.