నాలుగో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా 144/4
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానె(37; 93 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మూడో స్లిప్లో వేడ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 144 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(25), రిషభ్ పంత్ ఉన్నారు. అంతకుముందు జట్టు స్కోర్ 105 వద్ద సీనియర్ బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా(25; 94 బంతుల్లో 2×4) హేజిల్వుడ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 55 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 144/4గా నమోదైంది.