వినాయక ఉత్సవాలకు అనుమతినివ్వని తెలంగాణ సర్కార్

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ సర్కార్ వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. ఈ ఏడాది వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతినివ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది భోనాలు మరియు వినాయక ఉత్సవాలు ఘనంగా చేసుకుందామని సర్కార్ ప్రజలకు తెలిపింది. ప్రజలంతా తమ ఇళ్లలోనే వినాయకుని మట్టి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.