గిరిజన గ్రామాల నుండి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిలోకి భారీ చేరికలు

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం, గిరిజన గ్రామాలలో టిడిపి-జనసేన-బిజెపి, కూటమి ఏర్పాటు చేసిన సభకు హాజరైన రాష్ట్ర తెదేపా అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మరియు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్ర మోహన్ ఆధ్వర్యంలో నందిగాం మండలంలో హర్షబాడ, దిమ్మిడిజోల, బడగాం, రధజన బొడ్డపాడు గ్రామాలు నుంచి భారీగా వైకాపా నాయకులు కార్యకర్తలు టిడిపి జనసేన బిజెపి కూటమిలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ పొగిరి సురేష్ బాబు మరియు పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, ఎచ్చర్ల జనసేన నాయకులు అర్జున్ భూపతి, ధన్నాన చిరంజీవులు, సుజీకృష్ణ, మరియు వీరమహిళలు, జనసైనికులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.