భోగాపురంలో భూస్థాపితమైన వైయస్సార్సీపి.!

• భోగాపురం మండలంలో వైకాపా నేతల మూకుమ్మడి రాజీనామాలు.

నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆదివారం అధికారంగా వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే శ్రీనివాసరాజుతో పాటు అతని అనుచరవర్గం అయిన 40 మంది నాయకులు పార్టీని వీడారు. వైయస్సార్సీపి పార్టీని వీడిన కాకర్లపూడి శ్రీనివాసరాజుని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి అయన నివాసంలో కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన శ్రీనివాసరాజు అతి త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అవుతానని శ్రీమతి లోకం మాధవికి తెలిపారు. రాజీనామాలు చేసిన శ్రీనివాస్ రాజు అనుచరవర్గమైన 40 మంది ముఖ్య నేతలు లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మాధవి కండువాలు కప్పి వీరిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీలో ప్రథమం నుండి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసినా ఎటువంటి గౌరవం లభించకపోగా, నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధిని కుంటున పడేసిందని, నియోజకవర్గంలో అభివృద్ధికి కట్టుబడి శ్రమించే వ్యక్తి శ్రీమతి లోకం మాధవి అని తెలిపారు. లోకం మాధవి మాట్లాడుతూ వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమని నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేద్దామని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి అని మాధవి ప్రజలను కోరారు.