ఉగ్రవాదం, భయోత్పాతాలతో భక్తిని అణగదొక్కలేరు: మోదీ

సోమ్ నాథ్ దేవాలయం నవ భారతానికి చిహ్నమని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ లోని సోమ్ నాథ్ లో వివిధ ప్రాజెక్టులకు ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సోమ్ నాథ్ ప్రొమెనెడ్, సోమ్ నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీదేవి దేవాలయం, పాత సోమ్ నాథ్ దేవాలయ ప్రాంగణం పునర్నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడచిన వందల ఏళ్లలో సోమ్ నాథ్ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. ఆలయ ఉనికిని అంతం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదని అన్నారు. దీన్ని అంతం చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ… ఇది తిరిగి లేచినిలబడిందని చెప్పారు. ఉగ్రవాదం, భయోత్పాతాలతో భక్తిని అణగదొక్కలేరని చెప్పారు.