బోనాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

నందిగామ నియోజకవర్గం: బోనాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నందిగామ నియోజకవర్గ జనసేన వీరమహిళ తోటకూర పద్మావతి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. అమ్మవారికి ఆషాడం సారే, బోనాల సమర్పణ కార్యక్రమానికి పిలవగానే ఎంతో ఆత్మీయంగా, బాధ్యతతో కార్యక్రమానికి హాజరై, ప్రతి ఒక్కరూ భాగస్వాములై, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి, మల్లెపు విజయలక్ష్మి గారికి, రావి సౌజన్య గారికి, చింతల లక్ష్మీ గారికి ప్రతి ఒక్క వీరమహిళకు మరియు నందిగామనియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్క జనసైనికునికి పేరుపేరునాహృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కార్యక్రమానికి వెనక నుండి ఎన్నో సలహాలు, సూచనలు అందించి వెన్నంటి నిలిచిన సోదరుడు పూజారి రాజేష్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీ సహాయ సహకారాలు అన్నివేళలా వీర మహిళా విభాగానికి ఉండాలని మీ అండ దండలు ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా అలవోకగాచేయగలుగుతామని, ఈ రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కసోదరుని, సోదరీమణులని కోరుకుంటున్నానని పద్మావతి తెలిపారు.