సైకోలకే సైకో జోగి రమేష్

పెడన నియోజకవర్గం: పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని తద్వారా యువత చెడుదారులు పడుతున్నారని గవర్నర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా జోగి రమేష్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా బండ బూతులు తిట్టారు. అది మాకు సంబంధం లేని విషయం కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏక వచనంతో సంబోధిస్తూ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులను జోగి ఎంత దూషించిన పెడన తెలుగు తమ్ముళ్లు పన్నెత్తి మాట్లాడక పోవటం పెడన నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జోగి రమేష్ కి తెలుగు తమ్ముళ్ళకి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో తెలియడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినా కించపరిచే విధంగా మాట్లాడిన జనసైనికులుచూస్తూ ఊరుకోం. మీ మాటలకు దీటుగా స్పందిస్తాం ప్రతిఘటిస్తాం. ఇదే ధోరణిని కొనసాగిస్తే జోగి రమేష్ ఆఫీస్ ని ముట్టడిస్తాం. ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత మీ వైసీపీ ది కాదా?..
పెడన నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా గంజాయి విస్తరించింది. నియోజకవర్గంలో మీ కార్యకర్తలే గంజాయి అమ్ముతున్న మాట వాస్తవం కాదా?.. భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం రాష్ట్రానికి అవమానకరం కాదా?.. నువ్వు ఇంతవరకు జోకర్ రమేష్ అనుకున్నా కానీ నువ్వు బ్రోకర్ రమేష్ గాడివి. టిడిపికి, జనసేనకి పొత్తు ఉందని ఎలా చెబుతున్నావు మధ్యలో బ్రోకర్ గా ఉండి పొత్తు కుదిరించావా?.. దమ్ముంటే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేయండి అని సవాల్ చేస్తున్నావ్ మీకు దమ్ముంటే మద్యం పంచకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా, ఎలాంటి కేసులు లేకుండా క్లీన్ చిట్ తెచ్చుకొని పోటీ చేసే దమ్ము మీ వైసీపీ నాయకులకి ఉందా?.. నీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారితో చర్చలు అవసరం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పెడన నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఓపెన్ డిబేట్ కు నేను సిద్ధం. నీకు వచ్చే ధైర్యం ఉందా?.. పెడన నియోజకవర్గంలో నువ్వు చేసిన దోపిడి మీద అవినీతి మీద మేము సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా?.. నియోజకవర్గ సమస్యల మీద మాతో చర్చించే ధైర్యం నీకుందా?.. ముందు మాకు సమాధానం చెప్పు. పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్నీ నిలబెడతావా?, ముందు పెడనలో నువ్వు నిలబడతావో లేదో చూసుకో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగతం విమర్శలు చేసిన ఖబర్దార్ జోగి.. ఖబర్దార్.. అంటూ ఎస్ వి బాబు హెచ్చరించారు.