మంచినీటి కొరత తీర్చిన జనసేనకు కృతజ్ఞతలు

*జనం కోసం జనసేన

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండ నుండి పెద్ద కనుమల్ల పోవు రోడ్డు పక్కనే ఉన్న చెంచుల కాలనీని, నాడు జనం కోసం జనసేన కార్యక్రమంలో బాగంగా పర్యటిస్తున్నప్పుడు ఆ కాలనీ వాసులు నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు జనసేన పార్టీ నాయకులకు వారి ఆవేదన వ్యక్తపరిచారు. నేడు చెంచుల కాలనీ ప్రజలు మంచి నీటి వసతి లేక బందులు పడుతున్నారని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సింగరాయకొండ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేయడంతో కార్యదర్శి స్పందించి చెంచుల కాలనీకి మంచినీటి కొరతను తీర్చడం జరిగింది. అనంతరం చెంచుల కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, వీర మహిళలు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.