జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో చేజర్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు, జనసేన పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ… 2024లో జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోనికి వస్తుందని, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు మరియు జన సైనికులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.