జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన గాదె

గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం నల్లచెరువు 19 వార్డులో జనసైనికుడు వంగివరపు ప్రసాద్ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఆరోజు నుంచి ఇప్పటి వరకు అతను కోమాలో ఉన్న విషయాన్ని ఆ వార్డు నాయకులు దొడ్డి కోటి, తోట ప్రసాద్ లు ఈ విషయం గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకు రావడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి కదలలేని స్థితిలో ఉన్న జనసైనికుడిని సందర్శించి వారి కుటుంబ సభ్యులను ప్రస్తుత పరిస్థితుల మరియు ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని తెలిపారు. మీకు అవసరమున్న ఏ సహాయమైన పార్టీ తరపున మేము మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు వెంకట రతయ్య, నగర ఉపాధ్యక్షుడు చింత రాజు, తన్నీరు గంగరాజు, కొడుగంటి రవి, తుమ్మల నరసింహ, ఆసియా, మాధవి నాయుడు మరియు వార్డ్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.