రోడ్ల దుస్థితిపై మూడవ రోజు గళమెత్తిన బిల్లమడ జనసేన

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, బిల్లమడ గ్రామంలో రోడ్ల సమస్యలపైన మూడవ రోజు గళమెత్తిన బిల్లమడ జనసేన యువత

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి పై చేపట్టిన డిజిటల్ క్యాంప్ #GoodMorningCMSir లో పాల్గొన్న బిల్లుమడ జనసేన యువత..
ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రహదారులు గోతులు గుమ్ములు ఈ నెల 15 కి రోడ్లు పూర్తిచేస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పటికి పూర్తి కాకపోవడం వల్లన ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కి మరో సారి గుర్తు చేయటం కోసం ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది..

భామిని మండలం, బిల్లుమడ గ్రామంలో బత్తిలి – కొత్తూరు ప్రధాన రహదారి గోతులతో గత కొన్ని ఏళ్లుగా అస్తవ్యస్తంగా తయారైంది.. ఈ రహదారి ఒరిస్సా రాష్ట్రంనికి సరిహద్దు కావటం వలన రాకపోకలు జరుగుతూంటాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ప్రధాన రహదారికి రూపురేఖలు మారలేదు. ఈ ప్రధాన రహదారిలో ప్రతి రోజూ విద్యార్థులు, రోజు కూలీలు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారని.. ఈ రహదారిని ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రభుత్వం సరిచేయాలని జనసేన పార్టీ ద్వారా కోరడం జరిగింది.. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని తేలియజేయటం జరిగింది.. ఈ కార్యక్రమంలో మహేష్, నాగేశ్వరరావు, కోటి, కిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.