పత్తికొండ జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

పత్తికొండ, జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గురువారం, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీజర్ రాజశేఖర్ మాట్లాడుతూ… రేపు అనగా సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పత్తికొండలో ఒకటో తారీకున గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉదయం 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 2 వ తేదీన పత్తికొండలో గణేష్ నిమజ్జనం ఉన్నందువల్ల రక్తదాన శిబిరం కార్యక్రమాలను సెప్టెంబర్ 1వ తేదీనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి రక్తదానం చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పేషెంట్లకు యాక్సిడెంట్ వల్ల బ్లడ్ కావాల్సిన వచ్చినప్పుడల్లా మాకు కాల్ చేసి అన్న మాకు రక్తం అవసరం ఉందంటే ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎంతోమందికి మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో రకాలుగా రక్తదానం చేశారు. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో వివిధ రకాలుగా రక్తం కావాల్సి వస్తే మాకు ఫోన్ చేస్తే మా జనసేన పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని ఎప్పటికప్పుడు సాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని రాబోయే కాలంలో ప్రజలకు మరింత దగ్గరయ్యి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, నూర్ భాషా, ధర్మ తేజ, రామకృష్ణ, చాంద్ బాషా, ఎర్రి స్వామి, అనిల్, వీరేష్, ఆర్ కె నాయుడు, రవి, గఫూర్, యశ్వంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.