కేబుల్ బ్రిడ్జిపై సందడి .. ముగ్ధులవుతున్న సందర్శకులు

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు మీదుగా నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. ట్రాఫిక్ కష్టాలు తీరతాయని కట్టిన ఈ బ్రిడ్జ్ కాస్తా పర్యాటక ప్రదేశంలాగా మారిపోయింది. ఎందుకంటే  వంతెన అందాలు తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ముగ్ధులవుతున్నారు. ఊళ్ల నుంచి కూడా వచ్చి బ్రిడ్జ్‌ను చూసి సెల్ఫీలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. విద్యుత్‌ దీపాల దగదగల మధ్య సెల్ఫీలు తీసుకుంటూ, మరోవైపు బోటింగ్‌ చేస్తూ ప్రకృతి అందాలకు దాసోహమవుతున్నారు. శని, ఆదివారాలు వీకెండ్‌ కావడంతో సందర్శకుల సంఖ్య అధికమైంది. కాగా.. శుక్రవారం రాత్రి 11 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ బ్రిడ్జిపై వాహనదారులకు అనుమతి లేదనే విషయం తెలిసిందే. వంతెనపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.