రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయి: గంగారపు రాందాస్ చౌదరి
జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మదనపల్లె తంబాలపల్లి, పీలేరు, పుంగనూరు ప్రజల నినాదం ఒకటే. మనం జన్మించిన నేల మనం నడయాడిన నేల మనం మరణిస్తే మట్టిలో కలిసే నేల తల్లితో సమానం. అటువంటి మన మదనపల్లికి అవమానం జరిగింది. మదనపల్లికి అన్ని సదుపాయాలు హంగులు ఉన్న జిల్లా కేంద్రం చేయకుండా వేరే ప్రాంతానికి తరలించకపోవడం మదనపల్లి చుట్టూ ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినడం వలన రాబోయే ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, జిల్లా కేంద్రం చేయకపోగా విపక్షాల అందరి మీద కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురిచేస్తూన్నారని, రాబోయే ఎన్నికల్లో అన్ని విపక్షాలు కలిసి వైసీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-15-at-5.46.17-PM-1-1024x768.jpeg)