పవన్ అన్న సారధ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి

  • పవనన్న ప్రజా బాట 107వ రోజు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట 107వ రోజు కార్యక్రమాన్ని శనివారం సానిపాయి పంచాయతీ లోని పలు గ్రామాలలో జోగి మాలపల్లె, కుందేటి వానపల్లి, కృష్ణమయ్య గారి పల్లె, లెగిసేటి వారి పల్లె, కంసాల పల్లె, వంటిల్లులో గుగ్గిళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగినది. ఈ కార్యక్రమంలో సానిపాయి పంచాయతీలోని మూలపల్లె గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిందే గాని మాకు మా ఊరికి రోడ్డు కూడా వేయలేని స్థితిలో ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ జనసేన పార్టీ నాయకులు గుగ్గిళ్ళ వెంకటేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు సమస్య లేకుండా చేస్తామని ఆ గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు గుగ్గిళ్ళ వెంకటేష్. లోకేష్, భాస్కర పంతులు, వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, జనసేన వీరమహిళలు జడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.