యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పితాని

  • యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగనున్న యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ముమ్మడివరం జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ విలేకరులు సమావేశం నిర్వాహించారు. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉదయం నుండి సాయింత్రం వరకు జరగబోయే జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుండి భారీగా యువత తరలి వచ్చి యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం జనసేనపార్టీ కార్యాలయంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, జక్కంశెట్టి బాలకృష్ణ, గొల్లకోటి వెంకన్నబాబు, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్, అత్తిలి బాబురావు, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, నూకల దుర్గబాబు, పిల్లి గోపి పెన్నాడ శివ, పితాని శివ, ఎంపీటీసీ జమి, బీమాల సూర్య నాయుడు, గేదెల స్వరూప్, దూడల స్వామి, కడలి కొండ, వంగ విజయ్తో సీతారాం, లేటి గోపీ తదితరులు హాజరయ్యారు.