స్వాతంత్ర్య ఫలాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలి

* జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొణిదెల నాగబాబు
భారత దేశ స్వాతంత్ర్య ఫలాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి, దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేయడానికి ప్రతీ భారతీయుడు కంకణబద్దులు కావాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేసారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవ వేడుకల్లో నాగబాబు జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం మాట్లాడారు. భారత దేశ స్వాతంత్ర్య సమర యోధుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలని అన్నారు.

పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామ్యన్ని పరిరక్షించుకుందాం: తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్
బానిసత్వ పాలన విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన స్వాతంత్ర్య సమర యోధులను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పని చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలిట్ బ్యూరో సభ్యుడు అర్హాం ఖాన్ , అధికార ప్రతినిధి కూసంపుడి శ్రీనివాస్, జీ.హెచ్.ఎం.సీ. అధ్యక్షులు రాధారం రాజలింగం, కార్యదర్శి దామోదర్, నాయకులు ప్రజీత్ గౌడ్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *