గిరిజన బాలుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

సత్యవేడు నియోజకవర్గం, కె.వి.బి పురం మండలం దిగువ పుత్తూరు గిరిజన బాలుడు రెండు రోజుల క్రితం పాము కాటు వలన మరణించడం జరిగింది. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్, మండల అధ్యక్షుడు థామస్, బి.ఎన్ కండ్రిగ అధ్యక్షుడు బాషా గురువారం బాలుడి కుటుంబ సభ్యులను కలసి జనసేన పార్టీ ద్వారా 10 వేలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. లావణ్యకుమార్ మాట్లాడుతూ అంబులెన్సు రాకపోతే బాలుడు మృతదేహాన్ని తన తండ్రి స్కూటరు మీద 9 కిలోమీటర్లు తీసుకువెళ్లిన సంఘటన ప్రతిఒక్కరిని కలచివేసిందని, దీనిమీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని, విద్య, వైద్యం ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బుకి కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం గిరిజన కాలనీని సందర్శించి వీధి లైట్ లు గ్రామానికి రహదారి, పక్కా గృహాలు మంజూరు చేసేవరకు ప్రభుత్వంతో పోరాడుతామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, శాంసన్, దయ తదితరులు పాల్గొన్నారు.