నాదెండ్లను మర్యాద పూర్వకంగా కలిసిన కర్ణాటక జనసైనికులు

  • జనసేనాని పుట్టినరోజు వేడుకలకు నాదెండ్లను ఆహ్వానించిన కర్ణాటక జనసైనికులు

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కర్ణాటక జనసైనికులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన కర్ణాటకలో జరిగే జనసేనాని పుట్టిన రోజు వేడుకలకు మనోహర్ ను ఆహ్వానించారు. సెప్టెంబర్ 2వ తేదీన మొట్ట మొదటి సారి కర్ణాటకలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. మనోహర్ కు కర్ణాటక జనసైనికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుష్మాశ్రీనివాస్, మురళీగౌడ్, మంజునాథ్ ఎంసీ, విజయేంద్రగౌడ్, సుధాకర్, దేవరాజ్, గజేంద్రనాయక్, వినయ్, అనిల్, నాగేంద్ర, మంజునాథ్,
జనసైనికులు, వీరమహిళల పాల్గొన్నారు.