నేటి నుంచి మళ్లీ తెరుచుకోనున్న మేడారం ఆలయం

మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నేటి నుంచి తిరిగి తెరుచుకోనుంది. గత నెల 24 నుంచి 27 వరకు చిన్న జాతర జరిగింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పలువురు భక్తులతోపాటు విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బంది కరోనా వైరస్ బారినపడడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 20 రోజులపాటు ఆలయాన్ని మూసి వేసిన అధికారులు నేటి నుంచి మళ్లీ తెరవాలని నిర్ణయించారు.