వైస్సార్సీపీకి భారీ షాక్ ఇచ్చిన చక్రద్వారబంధం ప్రజలు
- వైస్సార్సీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు
- చక్రద్వారబంధం గ్రామంలో బీసీ కమ్యూనిటీ నుండి 150 మంది జనసేనలో చేరిక
- రాజానగరం నియోజకవర్గంలో పూర్తిగా కనుమరుగైపోయిన వైస్సార్సీపీ
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో బీసీ కమ్యూనిటీ నుండి జనసేన పార్టీ నాయకులు పితాని వెంకటేష్ ఆధ్వర్యంలో 150 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి, రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజా క్షేమం కోసం పాటుపడే తత్వం నచ్చి వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-6.55.16-PM-1024x476.jpeg)