రాష్ట్రానికి పట్టిన వైసీపీ విజ్ఞాలు తొలగిపోవాలి: నేరేళ్ళ సురేష్

  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వెలసిల్లాలి అంటే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన వైసీపీ విజ్ఞాలు తొలగిపోయేలా చూడాలని విజ్ఞాధిపతి వినాయకుణ్ణి కోరుకున్నట్లు గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వినాయకచవితి పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలో పెద్దఎత్తున వినాయకచవితి వేడుకలు అత్యంత వైభోపేతంగా జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకల్లో మహిళలు, యువకులు పాలుపంచుకుంటున్నారన్నారు. ప్రజలు చేపట్టే ఏ పనిలోనూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా వినాయకుడి శుభాషిసులు అందరిపై ఉండాలని నేరేళ్ళ సురేష్ గణపతిని వేడుకున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, కమిటీ సభ్యులు పుల్లంసెట్టి ఉదయ్, రెల్లి సంఘ నాయకుడు సోమి ఉదయ్, బందెల నవీన్, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, శానం రమేష్, సంజయ్, పసుపులేటి నరేష్, వడ్డె సుబ్బారావు, గట్టు శ్రీకాంత్, పులిగడ్డ నాగేశ్వరరావు, బన్నీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.