కానవరంలో జనంలోకి జనసేన మహా పాదయాత్ర మూడవ రోజు
రాజానగరం, రాజానగరం మండలం కానవరంలో బత్తుల బలరామకృష్ణ కుటుంబం చేపట్టిన జనంలోకి జనసేన మహా పాదయాత్ర మూడవ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ మహా పాదయాత్రలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మితో పాటు వారి కుమార్తె శ్రీమతి బత్తుల ప్రత్యూషదేవి, అలాగే కానవరం జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఇంటా మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. వెంకటలక్ష్మికి అలాగే వారి కుమార్తె శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవికి హారతులు పత్తి ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీకి ఓట్లేసి గెలిపిస్తామంటూ ప్రతి ఒక్కరూ బత్తుల వెంకటలక్ష్మికి, జనసేన నాయకులకు హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముద్రించిన కరపత్రాలను, కీ చైన్ లను ఇంటింటికి పంపిణీ చేసారు. రాబోయే ఎన్నికల్లో 50 వేల అత్యధిక మెజార్టీతో రాజానగరం నియోజకవర్గంలో జనసేన గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కానవరం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-07-at-10.47.52-1-1024x684.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-07-at-10.47.57-1-1024x684.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-07-at-10.48.01-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-07-at-10.47.54-1024x684.jpeg)