మూడో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యాచరణపై విస్తృత సమావేశం

విజయనగరం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ జనసైనికుల శ్రేయస్సు కోరి ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ మూడో విడత కార్యక్రమ తదుపరి కార్యాచరణపై విస్తృత సమావేశం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాల్ నగర్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీమతి మాత గాయత్రి, హుస్సేన్ ఖాన్, లోకల్ బాయ్ ప్రసాద్, రామకృష్ణ, సై కిరణ్ మరియు నాయకులు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.