హత్రాస్ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదట
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత అమ్మాయిపై పాశవిక రీతిలో అత్యాచారం చేశారంటూ దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని గొంతు నులిపి ఊపిరిఆడకుండా చేయడం వల్లే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని యూపీ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.