వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కర్మాగారాలు అమ్మేసే ప్రయత్నం చేస్తుంది: ఈదరాడ జనసేన

జనసేనాని పిలుపు మేరకు మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధకి తమ నిరసన తెలియచేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డలతో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీలు అందరు పార్లమెంటులో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని కోరారు.