పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు- బొంతు‌ రాజేశ్వరరావు

  • రాజోలులో ఎక్కువ సార్లు ప్రతీ గడపగడపకు వెళ్ళిన నాకు ప్రజలతో అందరికంటే ఎక్కువ సంబంధాలు వున్నాయి..
  • పవన్ కళ్యాణ్ గారు రాజోలు ప్రజల అభీష్టం మేరకు నాకు మంచి చేస్తారని నమ్మకం వుంది..
  • వదంతులు నమ్మ వద్దు, పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో న్యాయం చేస్తారు..
  • చనిపోయే వరకూ రాజోలు ప్రజలకు తోడుగా వుంటా..
  • బొంతు‌ రాజేశ్వరరావు జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం గ్రామంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద బొంతు అభిమానులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, సర్పంచ్ శ్రీనివాసరావు, మంగెన నాగభూషణం, విప్పర్తి సాయి బాబు, బోణం సాయి, మాజీ సర్పంచ్ దొంగ సూర్యనారాయణ, తూర్పుపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు రాము, మంగిన హైమావతి, యల్లమల్లి ఆనంద రాజు, గుబ్బల నారాయణరావు, సర్పంచ్ గుబ్బల రాజు తదితరులు.