కర్ణాటక జనసేన సంఘం మూడవ వార్షికోత్సవం

మైలారప్ప (ఎం ఎం జాగిరిధార్) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో కర్ణాటక రాష్ట్రం జనసేన సంఘం ఏర్పాటు చేసి, గడిచిన మూడు సంవత్సరాలుగ పార్టీ ప్రతీ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలో పాల్గొంటూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం యద్గిరి టౌన్ లో మూడవ వార్షికోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. జనసేన పార్టీ తరపున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, జనసేన పార్టీ తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ లను ఘనంగా సత్కరించి మెమెంటో అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో కర్ణాటక రాష్ట్రం జనసేన సంఘం ఏర్పాటు చేసి వారు చేస్తున సేవా కార్యక్రమాలను కొనియాడారు.