సిడ్నీ వేదికగా మూడో టెస్టు.. సమరానికి సిద్ధమైన భారత్ టీమ్

ఆస్ట్రేలియా పర్యటనలో రహానె సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. గురువారం మూడో టెస్టులో ఆసీస్‌తో సిడ్నీ వేదికగా భారత్‌ తలపడనుంది. సిడ్నీ టెస్టు కోసం భారత్‌ ఇప్పటికే జట్టును కూడా ప్రకటించింది. మూడో టెస్టుకు ముందు బుధవారం టీమ్‌ఇండియా ఫైనల్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొంది. ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో పాటు త్రోడౌన్‌లను సాధన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్‌ చేసింది.

కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టుల్లో భారత్ 1, ఆస్ట్రేలియా 1 గెలుచుకున్న సంగతి తెలిసిందే. కీలకమైన మూడో టెస్టుకు భారత జట్టు ఇలా ఉంది. రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, నవదీప్ సైనీ.